హైదరాబాద్ లో విజయవంతమైన సిద్స్ ఫార్మ్స్ హెల్త్ రన్‌

నవతెలంగాణ హైదరాబాద్: నాణ్యత మరియు సస్టైనబిలిటీ కి కట్టుబడిన ప్రముఖ డి2సి డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్స్ , ఈరోజు గచ్చిబౌలి ప్రాక్టీస్ స్టేడియంలో  తమ మొట్ట మొదటి  హైదరాబాద్ హెల్త్ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అన్ని వయసు విభాగాలకు చెందిన 2,000 మందికి పైగా  రన్నర్‌లు ఉత్సాహంగా పాల్గొన్నారు, ఇది ఫిట్‌నెస్, కమ్యూనిటీ మరియు శ్రేయస్సు కోసం అంకితమైన అద్భుతమైన రోజుగా మారింది.
ఈ రన్ లో నగరవాసులు మూడు కేటగిరీలు – 10కె  టైమ్డ్ రన్, 5కె  టైమ్డ్ రన్ మరియు 2కె  నాన్-టైమ్డ్ రన్ – లో పాల్గొన్నారు. వివిధ స్థాయిలలో ఫిట్‌నెస్ ప్రేమికుల అవసరాల ఇవి తీర్చాయి. కుటుంబాలు, పిల్లలు మరియు అన్ని వర్గాల ఫిట్‌నెస్ అభిమానులు ఈ ఈవెంట్‌కు మద్దతుగా నిలిచారు, ఆరోగ్యం పట్ల తమ భాగస్వామ్య నిబద్ధతను ప్రదర్శించారు. ఈ రేసులు పోటీతత్వంతో కూడుకున్నప్పటికీ వినోదభరితంగా జరిగాయి, పిల్లల నుండి వృద్ధుల వరకు, పురుషులు మరియు మహిళలు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు పాల్గొన్నారు. ఈ ఉత్తేజకరమైన ఈవెంట్‌ని విజయవంతంగా అమలు నిర్వహించటం లో గిగిల్ మగ్ ఈవెంట్స్ ఆర్గనైజర్ కీలకపాత్ర పోషించింది.
“సిద్స్ ఫార్మ్స్ లో, మా అధిక-నాణ్యత పాల ఉత్పత్తుల ద్వారా మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ద్వారా కమ్యూనిటీని పెంపొందించుకోవాలని మేము ఎల్లప్పుడూ విశ్వసిస్తున్నాము” అని సిద్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ ఇందుకూరి అన్నారు. “హైదరాబాద్ హెల్త్ రన్ అనేది ఫిట్‌నెస్ యొక్క వేడుక మరియు హైదరాబాద్ ప్రజలకు తిరిగి ఇచ్చే మార్గం, ఆరోగ్యాన్ని జీవిత మార్గంగా స్వీకరించమని వారిని ప్రోత్సహిస్తుంది. సమాజం నుండి ఈ కార్యక్రమానికి వచ్చిన అద్భుతమైన స్పందన పట్ల మేము సంతోషంగా వున్నాము, ఇంతమందిని చూడటం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది” అని అన్నారు.


10కె రన్  (18 నుండి 40 కేటగిరీ) విజేతగా ప్రేమ్ చంద్ 32:46 సమయం తో నిలిచాడు.  తరువాత స్థానంలో నెలిసివే జిసినిల్ మాగోంగో, 45:32  సమయం తో పరుగు ముగించాడు. 5కె  కేటగిరీలో, కెవిబి  రెడ్డి 19:57 ,  మరియు పింకీ గుప్తా 27:06 వద్ద విజేతలుగా నిలిచారు, అయితే 2 కె  విభాగంలో వివిధ వయసుల నుండి విస్తృత భాగస్వామ్యం కనిపించింది. రన్నరప్‌గా 10కె  పురుషుల 18 నుంచి 40 కేటగిరీలో విజయ్ ఠాకూర్, రవికుమార్, 5కె  పురుషుల 18 నుంచి 40 కేటగిరీలో ఉజ్వల్ మహతో ఉన్నారు. మేఘనా భూపతిరాజు మరియు అష్ని భూపతిరాజు 5కె  ఫిమేల్ అండర్ 18 విభాగాలలో మొదటి రెండు స్థానాలను గెలుచుకున్నారు. 41 నుండి 59 వరకు స్త్రీల 5కె  విభాగంలో ఆఫియా హంజా మరియు లీనా రాయ్ మరియు 60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషుల 5కె గ్రూప్ లో  వెంకట్రావ్ చెరుకూరి మరియు సూర్యచంద్రరాజు విజేతలుగా నిలిచారు. రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పతకం, టీ-షర్ట్, గూడీ బ్యాగ్ మరియు సర్టిఫికేట్ అందించారు వీటితో పాటుగా ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ కూడా అందించారు.  డాక్టర్ కిషోర్ తో పాటు, ఈ కార్యక్రమానికి డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి, ఐఎఫ్ఎస్ , టిఎస్ఐఐసి, సీతా పల్లచోళ్ల, వియ్ హబ్ యొక్క సీఈఓ, శ్రీనివాస్ రావు మహంకాళి (ఎంఎస్ఆర్), టి -హబ్  యొక్క సీఈఓ  వంటి గౌరవనీయ అతిథుల మద్దతు లభించింది. వారి హాజరు  ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను మరియు స్టార్టప్‌లు , ఆరోగ్య కార్యక్రమాల మధ్య బలమైన సహకార స్ఫూర్తిని నొక్కి చెప్పింది.


ఈవెంట్ యొక్క విజయాన్ని నిర్ధారించడానికి  టి -హబ్, వియ్ హబ్ మరియు బియా  బ్రాండ్‌లతో సహా  వివిధ సంస్థలతో సిద్స్ ఫార్మ్స్ భాగస్వామ్యం చేసుకుంది , ఇది హాజరైన వారికి తమ  ప్రసిద్ధ స్నాక్స్ మరియు కాఫీని బియా   అందించింది. ఈవెంట్ లో పాల్గొన్న వారికి వైద్య పరంగా  భద్రత కల్పించడం ద్వారా వైద్య సహాయాన్ని అందించడానికి రెడ్ హెల్త్  భాగస్వామ్యం చేసుకుంది. ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ ద్వారా కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ను పెంపొందించడానికి హైదరాబాద్ హెల్త్ రన్ ఒక అద్భుతమైన ముందడుగు, మరియు రాబోయే సంవత్సరాల్లో ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి సిద్స్ ఫార్మ్ ఎదురుచూస్తోంది.