భూపాలపల్లి పోలిస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ

నవతెలంగాణ-భూపాలపల్లి
పోలిస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సాధ్యమైనంతవరకు స్టేషన్‌ స్థాయిలోనే న్యాయం జరిగేలా పనిచేయాలని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్‌ ఖరే అన్నారు. సోమవారం భూపాలపల్లి పోలీస్‌ స్టేషన్‌ ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలిస్‌ స్టేషన్‌ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి డిఎస్పీ ఏ రాములు, ఎస్సై స్వప్న కుమారిని అడిగి తెలుసుకున్నారు. పోలిస్‌ స్టేషన్‌లో కేసులకు సంబంధించిన ఫైళ్లను, పలు రికార్డులను తనిఖీ చేశారు. పోలిస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదిదారుల స మస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని, ప్రజలకు న్యాయం చేసేలా కృషఙ చేయాలని సూచించారు. పోలీసు సిబ్బందికి తమ పరిధి ప్రతి గ్రామం గురించి అవగాహాన కల్గి ఉండాలని, ప్రజలతో మమేకమై, మరింత చేరువ కావాలని తెలిపారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. స్టేషన్‌ పరిసరాలను, శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది విధి విధానాల గురించి సూచించే 5 ఎస్‌ విధానంను పిఏస్‌లో అమలు చేయాలని సూ చించారు. ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉన్నందున విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఎలక్షన్లకు సంబంధించి తగు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళిని పారదర్శకంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ రాములు, ఎస్‌ఐ స్వప్నకుమారి, పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.