సాగునీటి కోసం రైతుల కన్నీటి కష్టాలు…

– ఎస్సారెస్పీ నీటి విడుదల జాప్యంతో ఎండుతున్న వరి పొలాలు.. నవతెలంగాణ నూతనకల్: ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి చేసినప్పటికీ అతి దగ్గరగా ఉన్న ,నూతనకల్ మండలానికి సాగునీరు అందక రైతులు అనేక అష్ట కష్టాల పాలవుతున్నారు ,వార బంది మాదిరిగా నీటిని విడుదల చేస్తున్న నీటి శాఖ అధికారులు నీరును అధిక మోతాదులో విడుదల చేయకపోవడంతో మండలంలోని అన్ని గ్రామాల చెరువులకు అందక భూగర్భ జలాలు అడుగంటి బావులు ఎండిపోయి బోర్లు నీళ్లు సరిగ్గా పోయాక వందల ఎకరాలు వరి ఎండిపోయి పశువుల పాలైతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గేటుకు అడ్డంగా ఉన్న చెత్తను తొలగిస్తున్న రైతులు..

ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీరు తుంగతుర్తి మండల పరిధిలోని జలాల్పురం వద్ద 69 డిపిఎం వద్ద కాలువ గేటుకు అడ్డంగా ఉన్న సర్కారు ,ముళ్ళ చెట్లు ,కంప చెట్లు ను తొలగించుతున్నారు . 22 /R కాలువలకు నీటి సరఫరా కాక పొలాలు ఎండడంతో పరిధిలోని చీల్పకుంట్ల గ్రామానికి చెందిన రైతులు ఆక్కడికి చేరుకొని స్వయంగా కంప చెట్లను తొలగించారు ఎండుతున్న పొలాలను చూసి సాగునీటి కోసం కష్టపడుతున్నామని ఇకనైనా అధికారులు స్పందించి విడుదల చేయాలని కోరుతున్నారు.

ఎస్సారెస్పీ అధికారులు నేటి సరఫరా ఆటంకాలను తొలగించాలి ఎస్సారెస్పీ కాలువలు పారుతున్న నీటికి అడ్డంగా ఉన్న కంపచట్లను మట్టి దుప్పలను అధికారులు స్పందించి వెంటనే తొలగించాలని కూసు గోపాల్ అధికారులను డిమాండ్ చేశారు.

పూర్తిస్థాయిలో నీటి సరఫరా కోసం కృషి చేస్తాం.

– ఎస్సారెస్పీ డీఈ, హరికృష్ణ,

69వ డిపిఎంకు కాలువకు నీటిని పూర్తిస్థాయిలో విడుదల చేశామని అన్ని గ్రామాలకు నీరు చేరుతాయని తెలిపారు ఇటీవలే కాలువకు అడ్డు ఉన్న చెట్లను తొలగించామని తెలిపారు. కొంతమంది రైతులు తమ గ్రామానికే నీరు అధిక ప్రవాహంగా రావాలనే ఉద్దేశంతో కంపచట్లను అడ్డు పెడుతున్నారని ఆరోపించారు నీటి ప్రవాహానికి చెట్లు అడ్డ ఉన్న విషయం తమ దృష్టికి రాలేదని, వెంటనే నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న కంప చెట్లను తొలగించి తొలగించి సాధ్యమైనంత వరకు సరఫరా చేస్తామని అన్నారు.