నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యజ్వాల రగిలించిన గొప్ప దార్శనికుడు దాశరథి కష్ణామాచార్యులు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కొనియాడారు.
మహౌన్నత కవి, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషా పండితుడు దాశరథి కష్ణమాచార్య 99 వ జయంతి సందర్భంగా ఆయన సేవల్ని సీఎం స్మరించుకున్నారు. సాహిత్యంలోని పలు ప్రక్రియల్లో విశేష కృషి చేసి, తెలుగు భాషా సాహిత్యాన్ని దాశరథి సుసంపన్నం చేశారని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాశరథి కష్ణామాచార్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడంతో పాటు, తెలుగు సాహిత్యంలో విశేష కషి చేసిన కవులకు ఆయన పేరుపై పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నదని తెలిపారు. 2023 సంవత్సరానికిగాను ఆయాచితం నటేశ్వర శర్మకు దాశరథి పురస్కారాన్ని ప్రదానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణను సాధించడంలో, రాష్ట్ర ప్రగతిని కొనసాగించడంలోనూ ఆయన స్పూర్తి ఇమిడి ఉన్నదని చెప్పారు.