

– పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ కు సర్పంచ్ సూర సమ్మయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం
నవతెలంగాణ -పెద్దపల్లి
తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 58 59 వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ భూములు నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్న వారికి ఉచితంగా పట్టాలి క్రమబద్ధీకరణ చేయాలని ఘన శ్యామ్ దాస్ నగర్ సర్పంచ్ సూర సమ్మయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావిస్తే నిరుపేదల బతుకులు మారుతాయి అని నీళ్లు నిధులు నియామకాలు సహకారం అవుతాయని కలలుగన్న వారందరికీ నిరాశ మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను రద్దుచేసి నివాసం ఉంటున్న వారి నుండి భూములు లాక్కుని దౌర్జన్యకాండ కొనసాగుతుందని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు సోమవారం పాలకుర్తి మండలం గన్ షామ్ దాస్ నగర్, కన్నాల గ్రామస్తులతో కలిసి అదనపు కలెక్టర్ శ్యాంలాల్ ప్రసాద్ కు 58 59 జీవో రద్దు చేసి ఉచితంగా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అంది ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు.
పాలకుర్తి మండలంలోని ఘన్ శ్యాం దాస్ నగర్ మరియు కన్నాల గ్రామస్తులైన వారు సుమారు 50 సంవత్సరాల నుండి నివసిస్తున్నారనీ,
ఇక్కడ స్థానిక క్వారీ, క్రషర్స్, కేశోరామ్ ఫ్యాక్టరీ లలో కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నారని, ఇక్కడున్న ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారు. ప్రతి గృహానికి ఇంటి నెంబర్ గ్రామపంచాయతీ వారు కేటాయించినారనీ తెలిపారు. ఇంటి పన్నులు కూడా గత 50 సంవత్సరాలు నుండి గ్రామపంచాయతీకి చెల్లిస్తున్నారనీ, గతంలో ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఇంటి నివేషణ స్థలం సర్టిఫికెట్స్ ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగిందనీ, ఇంటి స్థలం రెగ్యులేషన్ కోసం ప్రభుత్వం వారు జీవో నెంబర్ 58 59 ప్రకారం తీసుకొని రాగా వారు దరఖాస్తు చేసుకున్నరనీ, కానీ నిరుపేదలమైన వారు ప్రభుత్వ నిర్దేశించిన విధంగా డబ్బులు చెల్లించలేమని వారు తెలియజేయడం జరిగిందన్నారు. స్థానిక పాలకుర్తి మండల తహసిల్దార్ గారు మరియు సిబ్బంది మమ్మల్ని ప్రభుత్వానికి డబ్బులు చెల్లించమని ఇబ్బంది పెడుతున్నారనీ అడిషనల్ కలెక్టర్ తీసుకెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నెంబర్ 58 59 ఉపసంహరించుకొని ఉచిత భూమి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. నిధి నిరుపేదలమైన మేము అట్టి స్థలం లకు డబ్బులు చెల్లించ లేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. తమ సమస్యలను వివరించడానికి వెళ్తున్న గ్రామస్తులను పెద్దపల్లి పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సై బుద్ధ మల్లేష్ సర్పంచ్ సూర సమ్మయ్య మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం కొద్దిమంది మాత్రమే కలెక్టరేట్ వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న పాలకుర్తి తాసిల్దార్ పై చర్యలు తీసుకోవాలి
ఈ విషయంలో నిరుపేదలను దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఇబ్బంది పెడుతున్న పాలకుర్తి తాసిల్దార్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సూర సమ్మయ్య డిమాండ్ చేశారు. స్థలాల పరిశీలనకు వచ్చి ఇక్కడ నివసిస్తున్న మహిళలను అసభ్యకరమైన మాటలతో దుర్భసలాడుతూ , పురుషులను గాజులు తొడుక్కున్నారా అని ప్రజా ప్రతినిధులను కూడా తిడుతూ ఇండ్లు కూలగొట్టిస్తానని భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రభుత్వం సంక్షేమ పథకాలు రేషన్, కరెంట్, పెన్షన్, నిలిపివేస్తామని బెదిరించారనీ తెలియజేశారు. జిల్లా అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ ఇప్పటి నుండి ఎలాంటి భయభ్రాంతులకు బెదిరించుటకు ఏ అధికారులు కూడా రారు అని జిల్లా హామీ ఇవ్వడం జరిగిందనీ ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కన్నాల మాజీ సర్పంచ్ సూర సునీత వార్డు సభ్యులు ఓర్సు కొమరమ్మ, కంకటీ శ్రీనివాస్, గుర్రం నంబయ్య, సంపంగి సాగర్, తాలరి శంకర్,కాల్వ అంజయ్య యాదవ్, సూర సంతోష్,సంపంగి కుమార్,దాడి పోచమల్లు, కిషన్, రాజేశం, దాసి రాజమౌళి, పాలకుర్తి మండల మరియు ఘాన్ శ్యామ్ దాస్ నగర్ ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.