నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇటీవల కాలంలో ప్రభుత్వం మీడియా సంస్థలను నిషేధించడం, దాడులు చేయడం మీడియాను తమ అదుపులో ఉంచుకోవాలని చేస్తున్న వికృత చేష్టలను చూస్తుంటే నిజాం కాలంలో కొనసాగిన మీడియాపై నిర్బంధ పరిస్థితి తలపిస్తున్నదని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాస్ సురేష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొలి వెలుగు రఘు పై ప్రభుత్వం పన్నిన కుట్రను తీవ్రంగా ఖండించారు. క్యు న్యూస్పై జరిగిన దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు.