తెలంగాణ వారసత్వం గొప్పది:సీఎం కేసీఆర్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ చారిత్రక వారసత్వం మహౌన్నతమైనదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితంనాటి చారిత్రక ఆనవాళ్లు తెలంగాణలో లభ్యం కావడం గర్వకారణమని అన్నారు. ఈ దిశగా తెలంగాణ చరిత్ర కారులు చేస్తున్న కషి అభినందనీయమన్నారు. భారత జాగతి సంస్థ ప్రచురించిన తెలంగాణ చరిత్ర పుస్తకం 5 సంపుటాలను దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా ఆదివారంనాడాయన ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. భారత జాగతి చరిత్ర విభాగం గత ఆరేండ్లుగా రాష్ట్రంలోని అనేక చారిత్రక ప్రదేశాలను చరిత్రకారుడు రచయిత శ్రీరామోజు హరగోపాల్‌ ఆధ్వర్యంలో పలువురు చరిత్రకారులు సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశోధన చేసి సేకరించిన సమాచారాన్ని, మామిడి హరికష్ణ, వేముగంటి మురళీకష్ణ సంపాదకత్వంలో పుస్తకాలకు రూపకల్పన చేశారు. ఆయా ప్రదేశాల లోని శిలాజాలు, కట్టడాలు, శాసనాలు, నాణాలు, గ్రంథాలు సహా అన్ని రకాల చారిత్రక ఆధారాలను అధ్యయనం చేసినట్లు వారు ముఖ్యమంత్రికి తెలిపారు.