ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి ఆందోళనకరం

– రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి దుస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరుతూ ‘జస్టిస్‌ ఫర్‌ ఓజీహెచ్‌’ పేరుతో ఉన్న ఓ ట్విటర్‌ ఖాతాకు ఆమె రీట్వీట్‌ చేశారు. ఆస్పత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఫొటోతో పాటు.. కొత్త భవన నిర్మాణానికి జాయింట్‌ అసోసియేషన్‌ విడుదల చేసిన లేఖకు సంబంధించిన ఫొటోలు ట్వీట్‌కు జత చేశారు. ఎంతో మందికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించిన చరిత్ర ఉస్మానియా ఆస్పత్రికి ఉందని గుర్తుచేశారు. ఆస్పత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.