నేడు దేశంలో మహిళ సాధికారత కోసమై అనేక సంస్ధలు విశేషమైన కృషి చేస్తున్నవి, మహిళలు నేడు అనేక రంగాల్లో ఉజ్వలమైన అబివద్ది సాదించారు. ఆర్థిక, అంతరిక్షం, పరిశోధన రంగంలో, పార్లమెంటులో సైతం మేమేంతో మాకంత సమాన వాట, అవకాశాల కోసం, మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం నేటి మహిళలు ఉద్యమిస్తున్నారు, ఈ చైతన్యం తెలంగాణలో 75 సంవత్సరాల క్రీతమే తెలంగాణ సాయుధ పోరాటంలో వెల్లివిరిసింది. మహిళల మహోన్నత సాయుధ సమారాన మహిళా శక్తి ఎంతో త్యాగనీయమైనది. భూమి కోసం, కూలీ రేట్ల పెంపుకోసం వెట్టి నుండి విముక్తి కోసం సాయుధ పోరాటంలో గెరిల్లాలుగా మహిళ సైనికులుగా వారిపాత్ర అనిర్వచనీయమైనది,
ఈ పోరాటంలో మైదాన గ్రామీణ మహిళలే కాకుండ కోయ, చెంచు, లంబాడ మహిళలు వీరోచితంగా పోరాటపఠిమ కనబరిచారు. ముఖ్యంగా మహిళలు ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో పురుషులతో పాటు స్త్రీలు ఆయుధాలు పట్టి అజ్ఞాతంలోకి వెళ్లారు. కొందరు కొరియర్లుగా, ప్రజా సంఘాల కార్యకర్తలుగా, కళాకారులుగా, ఉద్యమ ఆయుధాలు, ఆహార చేరవేత కార్యక్రమంలో చురుకైన పాత్ర వహించారు. రజాకార్, యూనియన్ మిలటరీ సైనకుల ఆగాడాలను ఎదుర్కొని సాయుధ పోరాటంలో ఎంతో దీరత్వం, చైతన్య ప్రదర్శన కనబరిచారు. మనకు తెలిసిన మహిల పోరాట యోదురాళ్లు సంగెం లక్ష్మి బాయి, మల్లు స్వరాజ్యం, చాకలి అయిలమ్మ, ఆరుట్ల కమలాదేవి. వీరే కాకుండ, ఇంకా ఎంతో మంది వెలుగులోకి రాని చైతన్య మహిళామణులు చరిత్ర కెక్కివలసిన వారు ఉన్నారు. వారిలో జనగామ జిల్లా ఖిలాషాపురం గ్రామం గౌడ సామాజిక వర్గమైన దూడల సాలమ్మది వీరోచిత చరిత్ర.
చిన్న వయస్సు లోనే భర్త తాటిచెట్టు ఎక్కి ప్రమాదంలో మరణిస్తే, కుటుంబం పిల్లలపోషణ చేసుకుంటూ, వ్యవసాయం, కులవత్తి చేస్తూ జీవనం కొనసాగించేది.
తెలంగాణ సాయుధ పోరాటనికి ఆకర్షితురాలై ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినది. గబ్బేట తిరుమల రెడ్డి, నల్ల నర్సింహులు నాయకత్వంలో పూర్తి సమయం కార్యకర్తగా ఉద్యమంలో పనిచేసింది. ఉద్యమ సమయంలో వీరి ఇల్లు రాజకీయ క్షేత్రంగా ఉండేది. దీనితో స్థానిక భూస్వాములు, రజాకారులు ఈమె ఇల్లు కూల్చివేయడంతో, సాయుధ దళ కార్యకర్తగా మారి, సాయుధ శిక్షణ తీసుకొని సుశిక్షితమైన రైఫిల్ షూటర్గా శిక్షణ పొంది ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించింది. అజ్ఞాతంలో ఉన్న దూడల సాలమ్మకు దగ్గర బందువులు చనిపోయారని సమచారం అందితే, శత్రువు సమాచారంతో మైసురు పోలీసులు ఆమెను అరెస్టు చేసి రెండు సంవత్సరాలు జైల్లో ఖైదీని చేశారు.
మరో వీరనారి దాము మంగిలీ
దాము మంగిలీ కొడకండ్ల మండలం దర్మపురం గ్రామవాసి. వీరతెలంగాణ సాయుధ పోరాట నాయకులకు ఆశ్రమం ఇస్తున్నారని విసునూరు రజకారులు వీరి తండాపైన దాడి చేసి నాయకులు ఎక్కడ ఉన్నారో చెప్పమని చిత్ర హింసలు పెట్టారు. అయినా రహస్యలు చెప్పకుండా వారిపైన తిరుగుబాటు చేసింది. ఈ సంఘటనలో తిరుగుబాటు చేసిన ఐదుగురు యువకులను దాము మంగిలీ కండ్లముందే చంపి, చితి పేర్చారు.
ఈ ఐదుగురులో దాము మంగిలీ కొడుకు కూడ ఉన్నాడు. అరునాకూడా నాయకుల జాడ చెప్పలేదు మంగిలి.
ఈ సంఘటన జరిగిన మరో రెండు నెలల తర్వాత మళ్లీ తండాపై దాడి చేసి ముగ్గురు యువకులను కాల్చి చంపారు. ఇలా ఎన్ని చిత్ర హింసలకు గురైనా కూడా మంగిలీ దిగజారిపోలేదు. మంగిలి నలుగురు కొడుకులను జైల్లో పెట్టి, కుటుంబ సభ్యులను హింసించినా సాయుధ పోరాటంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా జీవిత కాలం కొనసాగింది మంగిలీ.
మరో వీరవనిత మల్లికాంబ. వీరిది ఖమ్మం జిల్లా. వీరి బర్త బ్రహ్మయ్య అనారోగ్యంతో చనిపోతే, ఆరుగురు పిల్లలను పోషించుకుంటూ సాయుధ పోరాటంలో నాయకత్వానికి సహయకారిగా ఉంది. ఈమె పెద్ద కొడుకు సాయుధ దళంలో చేరాడు. సుద్దేపల్లే గ్రామం పైన రజకారులు దాడి చేసినపుడు ఈ విషయం మచ్చ వీరయ్య దళనికి చెప్పి రజాకారులు దోచుకున్న సొమ్మును విడిపించింది మల్లికాంబ.
ఇంకో వీర వనిత రాంబాయమ్మ. వీరి గ్రామం పిండిప్రోలు. తెలంగాణ సాయుధ దళాలకు పిండిప్రోలు గుట్టల ముఖ్యమైన స్థావరముగా ఉండేవి.
రాంబాయమ్మ సాయుధ పోరాట దళాలకు ఎంతో సహాయ సహకారలు అందించేది. స్త్రీలందరిని సమికరించి ఉద్యమంలో చేర్పించింది. రజాకారు సైన్యం పిండిప్రోలు గుట్టలపైన దాడి చేస్తున్న విషయం తెలుసుకొని, ఆ విషయం దళానికి తెలిపడంతో ఈమేను అరెస్ట్ చేసి వరంగల్ జైల్లో 18 నెలలు బంధించారు.
నందిగామ తాలుకాలో వెంకమ్మ అనే మహిళ యూనియన్ సైన్యం దాష్టీకమైన చర్య వల్ల చనిపోయింది. ఇంతే కాకుండ ఏజెన్సీ ప్రాంతాల్లో గెరిల్లా దళంలో స్త్రీల పాత్ర వీరోచితమైనది. రంగమ్మ నల్లమల అడవుల్లో తూపాకి చేపట్టిన గేరిల్లా దళ సభ్యురాలు. తిరుపతమ్మ మరో గేరిల్లా సభ్యురాలు. వీరిది చింతపాలెం. ఈమె ఉద్యమంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న ధీర వనిత. సావిత్రమ్మని హుజూర్నగర్ సాయుధ పోరాటంలో అడవిలోకి వెళ్లి ప్రజల కోసం పనిచేసింది. బారత సైనికులు ఈమెను బంధించి జైలుకు పంపారు. వీరే కాకుండ నరసమ్మ, లచ్చమ్మ, పాపక్క, పడిగపాటి నాగమ్మ, బూదేమ్మ, కోయ లచ్చక్క ఇంకా ఎందరో వీరనారీ మణులు తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు.
75 సంవత్సరాల సాయుధ పోరాట వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ఈ సమయంలో నాటి ఉద్యమ చైతన్య దివిటిని అందుకొని నేటి ఆదునిక మహిళ అందుకొని అన్నీ రంగాల్లో అబివద్ది సాదించాలి, అవే వారికి ఘన నివాళులు.
– డాక్టర్ రంజిత్ కుమార్,
రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్ ఫెడరేషన్