ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం రూ.18వేలు ఇచ్చేవరకు పోరాటం ఆపేది లేదు..

– సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్
నవతెలంగాణ కరీంనగర్
ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం రూ.18000/-, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈరోజు అంబేద్కర్ స్టేడియం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా కార్యక్రమం చేశారు. ధర్నా అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ గారికి వినతిపత్రం అందజేశారు. CITU జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు అనేక పని ఒత్తిడి తట్టుకొని నిత్యం సేవలు అందిచటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డ్స్, రివార్డ్ పొందారు. కనీస వేతనం నిర్ణయం చేయాలని ఆందోళన చేస్తుంటే నిర్లక్ష్యం వహిస్తూ అందరిని రోడ్ మీద పడి వేశారు. కనీస వేతనం రూ.18000 వచ్చేవరకు పోరాటం ఆపేది లేదని తెలియచేశారు.26 వ తేదీన మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం,29 న ఎమ్మెల్యే ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం చేస్తామని తెలియజేశారు. ప్రభుత్వము వెంటనే చర్చించి నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా రిస్క్ అలవెన్స్ తన ఖాతాలో వేసుకుంది కానీ విడుదల చెయ్యటానికి చేతులు రావటం లేదు. PRC ఎరియర్ ఇవ్వకుండా అందరికీ కంటే ఎక్కువ జీతం ఇస్తున్నామని హరీష్ రావు గారు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఫిక్స్డ్ వేతనం రూ.10000 అమలు చేస్తున్నారు.కేరళ రాష్ట్రలో 18000/- ఇస్తున్నారు. ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో కనీసం ప్రమాద భీమా సౌకర్యం పొందలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది. హరీష్ రావు గారు తప్పుడు ప్రకటనలు బంద్ చేసి హెల్త్ రంగంలో పనిచేస్తున్న ఫ్రెంట్ లైన్ కార్మికులను పర్మినెంట్ చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
         CITU జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుంద రెడ్డి మాట్లాడుతూ  కరోనా కాలంలో ప్రజల ప్రాణాలు కాపాడిన మహిళ సైనికులు ఆశా కార్యకర్తలు.కంటి వెలుగు, లెప్రసీ, మలేరియా, టిబి గుర్తింపు కార్యక్రమంలో అత్యున్నత పాత్ర వహించారు. కానీ వారికి బిల్లులు మంజూరు చెయ్యలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది.మనసున మహారాజుకి చేసిన పనికి బిల్లులు ఇవ్వకుండా కడుపులు ఎండబెట్టడం ఎలాంటి మనస్సూ గుర్తించాలని కోరారు.దొర అహంకారం అనేది నిలువునా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి రంగవెని శారద,మారెళ్ల శ్రీలత,నాయకులు విజయలక్ష్మి,రాజమణి,పద్మ,శంకరమ్మ, రజియా,శోబా,సదాలక్ష్మి, లలిత,శ్యామల,అరుణ,శైలజ,మల్లిక,స్వరూప 300 మంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.