మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పదోన్నతిపై వచ్చి నూతనంగా బాధ్యతలు చేపట్టిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్నను మండల అంబెడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన సాయన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పదోన్నతి పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి, అభినందనలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఇదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉత్తమ సేవలు అందించి మరల ఈ పాఠశాలకు పదోన్నతిపై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా బదిలీపై రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వారి ఆధ్వర్యంలో పాఠశాలకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఆశిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు పాలేపు నర్సయ్య, కన్వీనర్ నిమ్మ రాజేంద్రప్రసాద్, కార్యదర్శి గుర్రం నరేష్, లెక్చరర్ సాయన్న, మండల కార్యవర్గ సభ్యులు మేకల క్రాంతి, వినయ్, దీపక్, యోగేష్, రాజేష్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.