డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ద్వారా రాబోతున్న మరో యూనిక్ వెబ్ సిరీస్ ‘దయా’. పవన్ సాధినేని దర్శకత్వంలో ఎస్వీఎఫ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించింది. జేడీ చక్రవర్తి, రమ్య నంబీశన్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆదివారం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను దర్శకుడు కష్ణవంశీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ బాగుంది. ఈ సిరీస్లోని బ్యాక్ గ్రౌండ్స్, ఎడిటింగ్ ప్యాట్రన్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. పవన్ కథను ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. చక్రికి చాలా రోజుల తర్వాత ఎనర్జిటిక్ క్యారెక్టర్ దొరికింది. ఈషా, విష్ణు ప్రియ క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి’ అని తెలిపారు.
”గులాబీ’ సినిమాతో నన్ను హీరోగా చేసిన కష్ణవంశీ ఈ కార్యక్రమానికి రావాలని నా కోరిక. అలాగే వచ్చాడు. నేను చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది. పవన్ను కలిసినప్పుడు డైరెక్టర్గా అతనిలో ఒక ప్రామిసింగ్ క్వాలిటీ కనిపించింది. ఫొటో షూట్ దగ్గర నుంచి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తను షూటింగ్ చేశాడు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ సూపర్బ్గా ఉంటుంది. కమల్, విష్ణు ప్రియ క్యారెక్టర్స్ సర్ప్రైజ్ చేస్తాయి. జోష్ రవికి మంచి క్యారెక్టర్ ఉంది. వెబ్ సిరీస్ బాగుంటుంది చూడండి అని మేము పదే పదే చెప్పనక్కర్లేదు. మీకు నచ్చుతుంది. నచ్చితే తప్పకుండా చూస్తారు’ అని హీరో జేడీ చక్రవర్తి చెప్పారు.