వైశ్య లైన్ లైట్ అవార్డు 2023 ప్రదానోత్సవ కార్యక్రమం

నవతెలంగాణ – కంటేశ్వర్
వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ 2023 ప్రదానోత్సవ కార్యక్రమం జేఆర్సి కన్వెన్షన్ హైదరాబాద్ లో జరిగింది. మోస్ట్ పాపులర్ వైశ్య మెన్ కేటగిరీ లో ఆన్లైన్ ఓటింగ్ ద్వారా నిర్వహించిన సందర్బంగా పబ్బ సాయి ప్రసాద్ 2 రాష్ట్రాల్లో 72 మంది పోటీలో ఉండగా 3 వ స్థానం లో నిలిచారు ఈ అవార్డ్ ని తెలంగాణలో ఆర్య వైశ్యుల ఏకైక గౌరవ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్త శాసన మండలి సభ్యులు బోగ్గరపు దయానంద్ గుప్త తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మజి ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త నిర్వకులు ఇమ్మడి శివ గారి చేతుల మీదుగా అందుకున్నారు. నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు నాపై మీ ప్రేమ ఆధార అభిమానాలు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ పబ్బ సాయి ప్రసాద్ తెలిపారు.