– నా పర్యటన తమిళనాడు ప్రజలకు ఉపయోగం
– ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పీటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను, ఐటీ, ఐటీ అనుబంధ కార్యక్రమాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు కషి చేస్తామని తమిళనాడు రాష్ట్ర రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్(పీటీఆర్) అన్నారు. తెలంగాణ రాష్ట్ర విధానాలు, కార్యక్రమాలను పరిశీలించేందుకు పీటీఆర్ ఆధ్వర్యంలోని ఒక బందం రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రెండో రోజు పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ వర్క్స్, టీ హబ్, వీ హబ్, గచ్చిబౌలిలోని టీ-ఫైబర్ కార్యాలయాన్ని శుక్రవారం వారు సందర్శించారు. అనంతరం హైదరాబాద్లోని టెక్ మహీంద్రా కార్యాలయంలో పలువురు ఐటి పరిశ్రమ భాగస్వాములతో సమావేశమయ్యారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, విధానాలను ఐటీ శాఖ అధికారులు త్యాగరాజన్కు వివరించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలో తెలంగాణ ఎంతో అభివద్ధి చెందిందనీ, ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ గణనీయమైన వృద్ధి సాధించిందన్నారు. ఈ రెండు నగరాలకు తోడుగా ఉండాల్సిన తమిళనాడు గత పాలకుల వల్ల ఐటీలో వృద్ధి సాధించలేకపోయిందని వాపోయారు. తాను ఐటీ బాధ్యతలు చేపట్టాక తమిళనాడులో ఎలాంటి విధానాలు పాటిస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ను సందర్శించినట్టు పీటీఆర్ వెల్లడించారు. తన పర్యటన తప్పకుండా అక్కడి ప్రజలకు మేలు చేకూర్చేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ పరిశ్రమ తొమ్మిదేండ్లల్లో అద్భుతంగా ముందుకెళ్లిందన్నారు. ఈ విధానాలను అడాప్ట్ చేసుకుంటామని చెప్పారు. ఇక్కడి ఆదర్శ విధానాలను తమిళనాడులో అమలు చేస్తామన్నారు.