నవతెలంగాణ-మహబూబాబాద్
వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని జిల్లా కలెక్టర్ శశాంక తెలియజేసారు. మంగళవారం ఐడిఓసి లోని కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడారు. జిల్లాలో సబ్ సెంటర్లు పూర్తి కావస్తున్నాయన్నారు. కంటివెలుగు కార్యక్రమం వేగవంతంగా చేపడుతున్నామని అన్నారు. మెడికల్ కళాశాల పనులు పర్యవేక్షిస్తున్నామని, హాస్పిటల్, హాస్టల్ నిర్మాణ పనులు పూర్తిచేయుస్తున్నట్లు వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… 30కి పైగా అస్టెంట్ ప్రొఫెసర్ లను నియమించామన్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదైతున్నందున ఉపాధిహామీ కూలీలకు షేడ్ నెట్స్ వేయించాలని, తాగునీరు, వైద్య శిబిరం ఏర్పాటు చేయించాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వెంట ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎంహెచ్ఓ హరీష్రాజ్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి శ్రీనివాస్, ఉప వైద్య అధికారులు అంబరీష, ఉమా గౌరీ, కంటి వైద్య నిపుణులు సత్యనారాయణ, డాక్టర్ సుధీర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ఉమ మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.