– 9న నసురుల్లాబాద్ లో భారీ సభ
నవతెలంగాణ – నసురుల్లాబాద్
తెలంగాణ దశాబ్ది ఉత్సాహలో భాగంగా ఈ నెల 9న నసురుల్లాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సంక్షేమ సంబరాలు మహాసభను విజయవంతం చేయాలంటూ సంక్షేమ లబ్ధిదారులకు సంక్షేమ సంబరాలపై వివరిస్తున్నారు. నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ లబ్ధిదారులకు సభను విజయవంతం చేయాలంటూ కోరుతున్నారు. ఈనెల 9న బొమ్మన్ దేవ్ పల్లి చౌరస్తా లో ఉన్న శ్రీ వేంకటసాయి స్కూల్ లో 9న నిర్వహిస్తున్న సంక్షేమ సంబరాలకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు. సంక్షేమ సంఘం తరాలకు మండలం లోని వివిధ గ్రామాల నుంచి పదివేల మంది సంక్షేమ లబ్ధిదారులను సమకూర్చేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులను చైతన్య పరుస్తున్నారు. సంక్షేమ పథకాలు లబ్ధిపొందుతున్న వారిని తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై అవగాహన కల్పిస్తున్నారు. సంక్షేమ సంబరాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు సంక్షేమ లబ్ధిదారులందరూ హాజరు కావాలని కోరుతున్నారు. 2014 కన్న ముందు సంక్షేమ పథకాలు ఎలా ఉండే ప్రస్తుతం సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయనే దానిపై ఇంటింటికి తిరుగుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వివరాలను వివరిస్తున్నారు. సంక్షేమ అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, ప్రతి ఒక్కరు సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కంది మల్లేష్, మైషగౌడ్, జిపి కార్యదర్శి రాజేష్ కారోబార్ రతన్, ఆరోగ్య సిబ్బంది వెంకటలక్ష్మి, అంగన్ వాడి సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.