సందీప్ కిషన్, డైరెక్టర్ విఐ ఆనంద్ రెండవ సారి కలిసి చేస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో సందీప్ కిషన్ మంత్రదండం పట్టు కుని కనిపించిన యాక్షన్ సీక్వెన్స్ చాలా క్యూరియా సిటీని పెంచింది. రెండు నెలల్లో సినిమా రానుం డటంతో మేకర్స్ త్వరలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరా బాద్లో షూటింగ్ జరుగుతోంది. ‘ఈ సినిమా సూపర్ నేచురల్ ఎలిమెంట్స్తో ఉండబోతుంది. సినిమా ప్రిమైజ్ని టీజర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. మొదటి రెండు పాటలు నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా ఇప్పటికే చార్ట్ బస్టర్గా నిలిచాయి. సందీప్ కిషన్ క్యారెక్టర్తోపాటు కథ,కథనాన్ని దర్శకుడు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో ఉండే గ్రాఫిక్ ఎలిమెంట్స్ అందర్నీ మెస్మరైజ్ చేస్తాయి. నూతన ఏడాదిలో వస్తున్న చిత్రాల్లో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’ అని చిత్ర యూనిట్ తెలిపింది. వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ తోట ఎడిటింగ్ : ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ : ఎ రామాంజనేయులు.