– సీపీఎం హన్మకొండ జిల్లా కమిటీ సభ్యులు మంద సంపత్
నవతెలంగాణ-హన్మకొండ
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతికి బాద్యులు ఎవరు అని సీపీఎం హన్మ కొండ జిల్లా కమిటీ సభ్యులు, సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ ప్రశ్నించారు. శనివారం 31 వ డివిజన్ హంటర్ రోడ్డు జేపీనగర్ లో అ వినీతి తిమింగాలన్ని శిక్షించాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ బల్దియాపై అవినీతి ఆరోపణలు నిత్య కత్యంగా మారాయని ఇందుగలడు అందు లేడందువా అన్నట్లుగా అ న్నివిభాగాల్లో అవినీతి రాజ్యమేల తున్నదనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నా యన్నారు. కేవలం కొంతమంది అధికారుల చేతివాటంతో పాలనా వ్యవ హారాలు గాడి తప్పుతున్నాయని ఆరోపించారు. అధికారుల అక్రమాలతో సామాన్య ప్రజానీకం కష్టనష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి దాపురించిందని విమర్శించారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్, ప్రజారోగ్య విభాగాలకు చెందిన కొందరు అధికారులు కేవలం డబ్బు సం పాదనే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్నారని ప్రజలు బల్దియా కార్యాల యం లోనే దుమ్మెత్తిపోసిన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. అధికారులు ఏసీబీకి అడ్డంగా దొరికిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. అయినా బల్దియా అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదని విమర్శిస్తు న్నారు. గతంలో ఇంటి నంబర్ కేటాయింపు విషయంలో ఆర్ఐతోపాటు ఓఉద్యోగి ఏసీబీకి పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. బల్దియా ఎన్ని అక్ర మాలు జరుగుతున్న పట్టిచుకోవడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమైయ్యారని అన్నారు. బల్దియాలో రూ.2 కోట్ల 31 లక్షల అవినీతి చేసినా రెవెన్యూ ఇన్ స్పె క్టర్ అన్వేష్ను వెంటనే అరెస్టు చేయాలన్నారు. అలాగే అన్వేష్ వెనకాల ఉ న్న చేతులను కూడా వెలికితీసి భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అలకుంట్ల యకయ్య, దూడ పాక రాజేందర్, నోముల కిషోర్, కంచర్ల కుమరస్వామి, అలకుంట్ల యక య్య, పల్లకొండ శ్రీకాంత్, చేరిపెళ్లి కుమరస్వామి, రాజు, భారతి, స్రవంతి, నవ్య తదితరులు పాల్గొన్నారు.