
నవతెలంగాణ డిచ్ పల్లి: గత పదేళ్లుగా రూరల్ నియోజకవర్గం లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామని, కులమత, వర్గం భేదం లేకుండా అందరి సంక్షేమానికి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎనలేని కృషి చేశారని, రాబోవు రోజుల్లో మరింత కృషి చేసి జిల్లాలోనే రూరల్ నియోజకవర్గం ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి మరింత కృషి చేస్తారని, ప్రతి కార్యకర్త మిగిలిన రోజుల్లో కష్టించి పని చేసి మెజార్టీ లక్షా కు తగ్గకుండా చుడాలని, ప్రజలకు అయా వర్గాలకు ఇచ్చిన హామీలను పూర్తి చేసే భద్యత తమపై ఉందని దర్పల్లి జడ్పీ టీసి బాజిరెడ్డి జగన్ మోహన్ అన్నారు. మంగళవారం ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి, ఎల్లారెడ్డి పల్లి స్వాగత తోరణాం వద్ద పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.అంతకు ముందు నల్లవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చిలువేరి దాస్, వైస్ ఎంపీపీ భూసని అంజయ్య, సర్పంచ్ విజయ లక్ష్మి లక్ష్మారెడ్డి నాయకులతో కలిసి ప్రారంభించారు. పలు సంఘల సబ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పలు సంఘాల అధ్వర్యంలో సమావేశలు పేట్టుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నామని, ఎన్నికలు ముగిసిన తర్వాత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అబివృద్ధి కి నీదులు మంజూరు చేస్తారని వివరించారు. ఇదే కాకుండా రూరల్ నీయోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో కోట్ల రూపాయల మేర అబివృద్ధి చేయడం జరిగిందని, ఈసారి భారీ మెజార్టీ తో గేలిపించుకుంటే మంత్రి పదవి ఖాయమని, దీంతో రూరల్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వద్ద కు ఏ వర్గానికి చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారందరిని కాదనకుండా సమస్యల పరిష్కారానికి అప్పటి కప్పుడే కృషి చేశారని అలాంటి నాయకునికి రూరల్ ప్రజలు వదులుకోవద్దని సూచించారు. బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా నిలుస్తామని ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారని వివరించారు. ఇతర పార్టీల కు చెందిన వారు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పి తమవైపు తిప్పుకుంటూ రాని, అలాంటి వారి మాటలను నమ్మవద్దని,ఎన్నికలు ముగిసిన తర్వాత హామీ ఇచ్చిన
వారు కంటికి కనబడరని, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజల కోసం శ్రమించే నాయకుడిని ఇతరుల మాయ మాటలు చెప్పి లోబర్చుకునే ప్రయత్నం చేస్తారని బాజిరెడ్డి జగన్ మోహన్ పేర్కొన్నారు. గ్రామానికి చెందిన పలు గ్రామాలకు చెందిన నాయకులు బాజిరెడ్డి జగన్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.చేరిన వారందరికీ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, నరేష్, మోహన్ నాయక్, రాజు నాయక్, బీఆర్ఎస్ రూరల్ ఎస్సీ కన్వీనర్ పాశం కుమర్, సర్పంచ్లు తెలు విజయ్ కుమార్, రాములు నాయక్, చింతల దాస్,సీనియర్ నాయకులు అరటి రఘు, సిహెచ్ దాస్, బిరిష్ శేట్టి, సంజీవ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, సామాజిక కార్యకర్త పులి సాగర్, పులి వసంత, పూర్య నాయక్, శ్రీనివాస్, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.