![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230724-WA0011.jpg)
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జిగా వచ్చిన పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మహేష్ కొనగలతో కలిసి నూతన కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించడానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు, పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బీన్ హమ్దాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, ప్రేమలత అగర్వాల్ ,జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజ్, కార్పొరేటర్ గడుగు రోహిత్, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మహిళలను జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు ప్రజాస్వామికంగా పోలీసులతో అరెస్టు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ మహేష్ కొనగల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలు ఉండడానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చామని, 2014 ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చారని అందులో ముఖ్యమైనది డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అని, కాంగ్రెస్ కట్టిన ఇల్లు చిన్నగా ఉన్నాయని అందుకే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని కేసీఆర్ ఎన్నికల సమయంలో పేదలకు హామీ ఇచ్చాడని, అదేవిధంగా 2014లో ప్రతి నియోజకవర్గంలో 5000 వరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసిన రాష్ట్ర బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని నిర్మించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ,కమిషన్లు వచ్చే నీటి ప్రాజెక్టుల్లో చూపించిన శ్రద్ధ టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో చూపించడం లేదని, టిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు అని పరిశీలించడానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అక్రమంగా ప్రజాస్వామ్యాన్ని వారి చేతిలోకి తీసుకొని పోలీసు బలగాలను మోహరించి పార్టీ కార్యాలయం నుండి కదలనివ్వకుండా అరెస్టు చేయించడం అనేది వారి నిరంకుశ పాలనకు నిదర్శనమని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని పేదలకు ఆశా చూపి వారిని మభ్య పెట్టిన కేసీఆర్ కు ఆ పేద ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని, కాంగ్రెస్ నాయకుల అరెస్టు అనేది అప్రజాస్వామికం అని డాక్టర్ మహేష్ కొనగల అన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ ,రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భాగ్య, రాష్ట్ర ప్రచార కమిటీ ఈసీ మెంబర్స్ జావిద్ అక్రమ్ ,గడుగు రోహిత్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు ,దయాకర్ గౌడ్, పిసిసి కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు పోల ఉష, తంబాకు చంద్రకళ ,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, జిల్లా సేవల అధ్యక్షులు సంతోష్, పిసిసి మెంబర్ ఈసా ,నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్, అబూద్ బీన్ హంధాన్, నగర మైనారిటీ అధ్యక్షులు ఎజాజ్, నగర ఎస్టీ అధ్యక్షులు సుభాష్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ బొబ్బిలి, మహిళా కాంగ్రెస్ నాయకులు విజయలక్ష్మి, సాగర్, మోయిన్, శోభన్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.