నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్ణయం మేరకు శనివారం హైకోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్ బెంచ్లకు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జి యతిరాజులు, జస్టిస్ జి.శ్రీదేవి అధ్యక్షత వహించగా…మొత్తం 218 కేసులు పరిష్కారమయ్యాయి. 650 మందికి సుమారు రూ.12కోట్ల పరిహారం అందనుంది.