– పరీక్షలపై అభ్యర్థులకు ప్రత్యేక అవగాహన : టీశాట్ సీఈవో శైలేష్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రూప్-2 పోటీ పరీక్షల కోసం గురువారం నుంచి మరో మూడు గంటలపాటు అదనంగా పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నట్టు టీశాట్ సీఈవో రాంపురం శైలేష్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతనెల రోజులుగా ప్రతి రోజూ రెండు గంటలపాటు ప్రసారాలు అందించా మని పేర్కొన్నారు. గురువారం నుంచి ఉదయం ఐదు నుంచి పది గంటల (అదనంగా మూడు గంటలు) వరకు ఛానళ్లు ప్రసారాలు కొనసాగిస్తా యని వివరించారు. నిపుణ ఛానల్లో సాయంత్రం ఐదు నుంచి రాత్రి పది గంటల వరకు ఇంగ్లీష్, జాగ్రఫీ, తెలంగాణ ఉద్యమం, చరిత్ర, ఎకానమి సబ్జె క్టులపై ప్రసారాలుంటా యని తెలిపారు. మరుసటి శుక్రవారం విద్య ఛానల్లో తెల్లవారు జామున ఐదు నుంచి పది గంటల వరకు పున:ప్రసారాలుంటా యని పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్షలు ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటిం చిన నేపథ్యంలో అభ్యర్థులకు మరిన్ని పాఠ్యాంశాలను అందించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా మని తెలిపారు. గతనెల మొదటి వారం నుంచి రెండు గంటలు ప్రసారాలు అందించిన టీశాట్ నెట్వ ర్క్ ప్రస్తుతం అందించే మరో మూడు గంటలు అదనం కానున్నాయని వివరించారు. పరీక్షల సంద ర్భంగా అభ్యర్థులకు సబ్జెక్ట్లపై ప్రత్యేక అవగాహన ప్రసార కార్యక్రమాలుంటాయని తెలిపారు.