మాదిగ మహిళ సమాఖ్య అధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అధ్యక్షతన 3 వ రోజు దీక్షను ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి శనిగరం మురళి కృష్ణ మాదిగ శనివారం ప్రారంభించారు.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ఈ నెల 18 నుండి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన దీక్షలో ఎం ఎం ఎస్ జాతీయ నాయకురాలు పెద్దోళ్ల యమున, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు గుంటు పద్మ, కన్నురి సుధ, రోడ్డ స్వప్న, అబ్బమ్మ, సుజాత, లక్ష్మి, సొన భాయ్, సావిత్రి, అక్షిత, ఎం ఎస్ పి నియోజకవర్గ ఇన్చార్జి సరికెళ్ల పోషెట్టీ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రోడ్డ ప్రవీణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.