– మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హరితహారం కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 70 శాతం దోపిడీకి పాల్పడుతున్నదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. సోమవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లా డారు. సచివాలయం, అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణంతో పాటు అన్నింటిలోనూ అధికార పార్టీ నేతలు దోపిడి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి మొక్కకు లెక్క తీస్తామని హెచ్చరిం చారు.