ఎయిర్‌పోర్టులో 785 గ్రాముల బంగారం పట్టివేత

– దీని విలువ రూ.47.49 లక్షలు
నవతెలంగాణ-శంషాబాద్‌
విదేశాల నుంచి శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అక్రమంగా తరలించిన బంగారాన్ని హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు సోమవారం పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జేడ్డా నుంచి ఒక ప్రయాణికుడు తెల్లవారుజామున హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నాడు. అతనిపై అనుమానం రావడంతో అతనితోపాటు లగేజ్‌ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరిస్తున్న 785 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.47.49 లక్షలు ఉంటుందని అంచనా. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.