నవతెలంగాణ- శంకరపట్నం: ఈ నెల 26న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే చాకలి ఐలమ్మ 128 వ జయంతి ఉత్సవ కమిటీ కో కన్వీనర్ గా శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన రాసమల్ల శ్రీనివాస్ ను నియమించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఉత్సవ కమిటిలో అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇందుకు సహకరించిన గౌరవ ఎమ్మెల్సి బస్వరాజ్ సారయ్య గారికి, రజక సంఘం రాష్ట్ర నాయకులు అక్కరాజు శ్రీనివాస్ గారికి, దుబ్బాక రమేష్ గారికి,పెద్దాపురం కుమార స్వామి గారికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.