జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో నిర్మల ఉదయ హై స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి వినతి పత్రం సోమవారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నావాతే ప్రతాప్ మాట్లాడుతూ.. నిర్మల ఉదయ యాజమాన్యం ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. కనీసం పేరెంట్స్ మీటింగ్ పెట్టకుండా ఇష్టానుసారంగా ఫీజులు పెంచడం ఒకటే ఇన్స్టాల్మెంట్ లో డబ్బులు పే చెయ్యాలని కండిషన్లు పెట్టడం అబ్బాయిలలో బాలికలను ఓకే బెంచ్ లు కూర్చోబెట్టడం యాజమాన్యం ప్రమీల మేడం విద్యార్థుల పట్ల దురుసుగా మాట్లాడడం అదేవిధంగా ఒక క్లాస్ రూమ్ లో 50 నుంచి 60 మంది విద్యార్థులను కూర్చోబెట్టడం ఈ విషయాలపై పరిమార్లు డి ఈ ఓ కి చెప్పిన పట్టించుకోకపోవడంతోని సోమవారం కలెక్టర్ గాని కలవడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించకపోతే డిఓ ఆఫీస్ ముట్టడి చేస్తామని బీసీ విద్యార్థి సంఘం హెచ్చరిస్తా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నావాతే ప్రతాప్ వైశాఫీ సంతోష్, పరమేష్, ప్రసాద్, వెంకట్, చిన్న, గణేష్ యాదవ్, విక్రం రెడ్డి నిర్మల ఉదయ పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల హృదయ హై స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ -కంటేశ్వర్