తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సుదీర్ఘ వేబినార్లో భాగంగా ఆత్మహత్యల నివారణ పై వైద్య ఆరోగ్యశాఖలో ఇఆర్టి కౌన్సిలర్గా పనిచేస్తున్న డాక్టర్ వడియాల ప్రవీణ్ రెడ్డి ప్రసంగించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. ఉరుకులు పరుగులు జీవితంలో ప్రతి మనిషి మానసిక ఒత్తిళ్లకు గురవుతుంటారని ఆరోగ్యం పై దృష్టి సారించే విధంగా సైకాలజిస్టులు కృషి చేయాలని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. సోమవారం హిమాయత్ నగర్ లోని ఎస్ఎన్ రెడ్డి భవన్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న డాక్టర్ వడియాల ప్రవీణ్ రెడ్డికి ధ్రువీకరణ పత్రం అందించడం జరిగింది. తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోతుకూరి రామచందర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి సముద్రాల వేణుగోపాల చారి హాజరై మాట్లాడారు. మంచి ఆలోచనలతో అందమైన జీవితాన్ని ఏర్పరచుకొని నిత్యం శారీరక వ్యాయామం యోగా చేస్తూ మానసిక ప్రశాంతత పొందాలన్నారు. అనంతరం డాక్టర్ వడియాల ప్రవీణ్ రెడ్డి కి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.