నవతెలంగాణ- వరంగల్: ములుగులో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవిత, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రూ.180 కోట్లతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. రామచంద్రాపూర్ గ్రామంలో రూ.2.36 కోట్లతో నిర్మించే 33 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన నవ జాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడి నుండి బండారుపల్లి రోడ్డులోని తంగేడు మైదానానికి చేరుకొని దళిత బంధుతో పాటు గృహలక్ష్మి పథకాలకు చెందిన లబ్ధిదారులకు పథకాలను పంపిణీ చేయనున్నారు.