నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. గంగపుత్ర కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. నాలుగేళ్ల చిన్నారికి ఉరి వేసి ఆపై దంపతులు కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు కర్నూలు జిల్లా లక్ష్మీపురం వాస్తవ్యులుగా గుర్తించారు. వారాసిగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు భర్త కొప్పుల సాయి కృష్ణ , భార్య చిత్రకళ , కూతురు తేజస్విని(4)గా తెలుస్తోంది. వారాసిగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతురాలు చిత్రకళ బిర్లా ప్లానిటోరియంలో ఉద్యోగి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.