అంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మె 20వ రోజుకు చేరుకుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కురేందుల సమ్మక్క ఆధ్వర్యంలో అంగన్వాడీలు పొరలు దండం పెట్టి వినూత్న నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మక్క మాట్లాడుతూ 20వ రోజులకు చోరీ న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే స్పందించి మా అంగన్వాడి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేసి 26 వేల వేతనంతో పాటు ప్రభుత్వ ఉద్యోగి ఉండవలసిన అలవెన్స్ అన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. మండల అధ్యక్షురాలు జమున నాయకులు రుక్మిణి, రమాదేవి, సుమలత, లక్ష్మి, ఆదిలక్ష్మి, వెంకటలక్ష్మి, సరిత, నిర్మల, మంజుల, సిడిపిఓ పరిధిలోని 80 మంది అంగన్వాడీలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.