– సమ్మె బాట పట్టడంతో పేరుకు పోతున్న ఫైళ్లు
– ఆరో రోజుకు చేరిన ఆపరేటర్ల దీక్షలు
– కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
నవతెలంగాణ:బోధన్ టౌన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పారదర్శకత, గ్రామ ప్రజలకు జవాబుదారి తనంతో పాటు సేవలలో సమర్ధత కలిగి త్వరితగతిన పనులు సమకూర్చే విధంగా ఈ- పంచాయతీల ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీలలో సేవలందించేందుకు కంప్యూటర్ ఆపరేటర్ల నియామకం చేపట్టారు. ఆపరేటర్ల వేతనాలు గ్రామ పంచాయతీలలో చెల్లించాలని నిర్ణయించడంతో వచ్చే ఆదాయం సరిపోక కుటుంబాలను పోషించుకోలేక గత 9 సంవత్సరాల నుండి వెట్టి చాకిరి చేస్తున్నామని, చాలా ఇబ్బందులు పడుతున్నామని, కంప్యూటర్ ఆపరేటర్లు వాపోతున్నారు. రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారి సమస్యల పరిష్కారం కొరకు నేటికీ గురువారం 7 రోజున నుండి బోధన్ మండలం కార్యాలయంలో ముందు పరిధిలో వద్ద సమ్మెబాట చేపట్టారు. ప్రస్తుతం నిజాంబాద్ జిల్లాలోని ధర్నా చౌక్ వద్ద సమ్మె నిర్వహిస్తున్నారు. సమ్మె వలన గ్రామాలలో పలు పనులు కుంటువడి ఫైళ్లు పేరుకుపోతున్నది వాస్తవం. ప్రభుత్వం ఇంటర్నెట్ గ్రామ పంచాయతీలలో ప్రజలకు అందిస్తు న్న అన్ని రకాల సేవలను కంప్యూటర్లో పొందు పరి చేందుకు ప్రభుత్వం ఈ- పంచాయతీలను 2014 -15 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తొలుత జిల్లా పంచాయతీ కార్యాలయంలో ప్రాజెక్టు మేనేజర్ డిపిఎం లను అనంతరం పల్లెలలో క్లస్టర్ల పరిధిలో కంప్యూటర్ ఆపరేటర్లను నియామకం చేసింది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కార్వీ సంస్థ ద్వారా వీరి నియామకాలను చేపట్టారు. కంప్యూటర్ ఆపరేటర్ల లందరికీ 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి పరిపాలన నిధుల కింద పది శాతం నిధులు కేటాయించి సుమారు నెలకు 8 వేల రూపాయలకు తక్కువ కాకుండా వేతనాలు. చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో డిస్ట్రిక్ ప్రాజెక్టు డిపిఎంతో పాటు 100 మంది కంప్యూటర్ ఆపరేటర్లు బోధన్ మండలంలో 6 ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క ఆపరేటర్ 7 నుండి 8 గ్రామ పంచాయతీలలో పనులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న దళితబంధు, బిసి, ముస్లిం మైనార్జీ బంధు, గృహలక్ష్మి సంక్షేమ పథకాలతో పాటు గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆదాయ వ్యయంతో పాటు ప్రణాళిక కార్యాచరణ చేపట్టవలసిన పనులు సిబ్బంది వేతనాలు విద్య వైద్యం పౌష్టిక ఆహారం సామాజిక భద్రత పేదరిక నిర్మూలన వ్యవసాయం తాగునీరు పారిశు ధ్య పనులు సహజ వనరులు మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను జనన మరణ వివరాలు ఇంటి పన్నులు అనుమతులు నూతన నిర్మాణ కొలతలు నల్లాల పన్నులు ఎన్నికల విధులు తదితర వాటిని ఆన్లైన్లో పొందుపరచడం వంటి పనులు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పురస్కారాలు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నాం. అవార్డులు రావడంలో ప్రధాన భూమిక పోషించేది మేమే చాలీచాలని జీతాలతో కుటుంబాలను అని ఈ పంచాయతీ ఆపరేటర్లు తెలిపారు. ఈ పంచాయతీ 9 సంవత్సరాల కాలం భోజన కార్మికులు, ఆశా కార్యకర్తలు సమ్మె చేస్తుండగా ఈ పంచాయతీ సిబ్బంది సమ్మె బాట పట్టడంతో గ్రామాలలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయని ప్రజలు ఉద్యోగులుగా గుర్తించాలి.
విమర్శిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కొరకు పలు మారులు ఉన్నత స్థాయి అధికారులకు సమస్య పరిష్కరించాలని కోరినప్పటికీ
జిల్లా స్థాయిలో పని చేసే డీపీఎంకు పే స్కేలు గ్రామ పంచాయతీలలో పనిచేసే ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు జూనియర్ అసిస్టెంట్ హెూదా కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, ఆరోగ్య బీమా ఉద్యోగ భద్రత కల్పించాలని, మృతి చెందిన కుటుంబంలోని ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని వసతులు. కల్పించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
పెరుగుతున్న నిత్యవసరాల ధరలతో పోషించుకోలేక పలు ఇబ్బందులు నుండి వెట్టి చాకిరి చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలను ప్రభుత్వ పరిష్కరించాలి.
నిజామాబాద్ జిల్లా కంప్యూటర్ ఆపరేటర్ల జిల్లా సంఘం అధ్యక్షులు
ఏ.నరహరి