– సుద్ధులం గ్రామంలో ₹ రూ.6 కోట్ల 65 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు..
– రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ -డిచ్ పల్లి
రాజకీయాల్లో గెలిచిన ఓన ప్రజలతోనే మమేకమై వారి కష్టసుఖాల్లో వెన్నంటే ఉండాలని, ఎన్నికలు వచ్చినప్పుడే కాదని, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని,సుద్ధులం గ్రామంలో ₹ రూ.6 కోట్ల 65 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందని, ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదని, అభివృద్ధి జరిగిందా లేదా అనేదే ముఖ్యమని, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని,సుదులం గ్రామంలో 32 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేపట్టామని,క్రీడా రంగానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేసిందని, బతుకమ్మ చీరలను పంపిణీ చేశామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం డిచ్ పల్లి మండలం లోని సుద్దులం గ్రామంలో గ్రామంలో ₹ రూ.6 కోట్ల 65 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో
ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ సుద్ధులం గ్రామంలో జయశంకర్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరించుకొని అదేవిధంగా 1 కోటి 60 లక్షల రూపాయలతో బైపాస్ రోడ్డు శంకుస్థాపన చేసుకుని, గ్రామంలో కోట్ల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేసుకుంటూ, వివిధ సంఘాల, కమ్యూనిటీ భవనాలు, మహిళా భవనాలు, గ్రామంలో అంతర్గత సిసి రోడ్లు, అంతర్గత డ్రైనేజీలు, వైకుంఠధామాలు, మన ఊరు మనబడి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.సుద్ధలం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన ఇళ్ల పట్టాల పంపిణీ 32 మందికి పంపిణీ పంపిణీ చేశారు అదే విధంగా తెలంగాణ సర్కార్ క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తూ గ్రామాల్లో యువకులకు క్రీడా కిట్లను వివిధ గ్రామాలకు చెందిన యువకులకు పంపిణీ చేశారు, రాబోయే రోజుల్లో బతుకమ్మ సంబరాలు వస్తున్న సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా ప్రతి సంవత్సరం ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అబివృద్ధి పరంగా చెరువులు, కుంటలు, కోట్ల రూపాయలతో మరమ్మతులను ప్రతి గ్రామంలో చేయడం జరిగిందన్నారు. కుల వృత్తులను కాపాడేందుకు, ప్రతి ఒక్క వర్గానికి అర్దిక పరంగా అన్ని కులస్తులకు సమన్యాయం సీఎం కేసీఆర్ చేస్తున్న రాని వివరించారు. గుండ్ల కులస్తులకు చాపలు పంపిణీ, యాదవులకు మేకలు, గోర్లు పంపిణీ చేపట్టామని,తెలంగాణ వస్తే ఏమొస్తది అన్నా దానికి ఇవి చేసిన చేస్తున్న పనులే నిదర్శనంగా నిలుస్తోందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. మోధీ కి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేదని, తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అన్నారని, ముమ్మాటికీ తెలంగాణ వ్యతిరేకి మోధీ అని గుర్తు చేశారు .తెలంగాణ పార్టీ కేసీఆర్ పార్టీ అని కెసిఆర్ పార్టీ తెలంగాణ పార్టీ అన్నారు.పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మితో సామాజిక భద్రత కల్పిస్తున్నదని, బీడీ పెన్షన్ ,వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్, రైతులకు 24 గంటలు కరెంట్, తోపాటు వందలది పథకాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని, మరి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు అవుతలేవో బిజెపి నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు.రూరల్ లో, జిల్లా లో, రాష్ట్రంలో బీజేపీ వాష్ అవుట్ అయ్యిందని, కాని కొందరు నాయకుల మాటలు ఎలా ఉన్నాయో అని ఒక సామెతను గుర్తు చేశారు. అమ్మకు అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడట, అన్నా చందంగా మారింది బిజెపి నాయకుల తీరు ఉందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్కు మరోసారి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
కేసీఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రతిపక్ష నాయకులు అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ ప్రజల దగ్గరికి వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభివృద్ధి చేసే వారెవరో మాటలు చెప్పే వారెవరో ప్రజలు గమనించాలని, రాబోయే రోజుల్లో బీజేపీ ,కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దాసరి ఇంద్ర లక్ష్మీ నర్సయ్య,. మండల అధ్యక్షులు. చింతం శ్రీనివాస్ రెడ్డి గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నారాయణరెడ్డి గారు, సర్పంచుల పోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, ఎంపీటీసీల పోరం అధ్యక్షులు దండుగుల సాయిలు గారు, యూత్ అధ్యక్షులు ఆమీర్ గారు, స్థానిక సర్పంచ్ వెంకటేష్ గారు, సీనియర్ నాయకులు చక్కరి కొండ కృష్ణ గారు, ఓడెం నరసయ్య గారు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీ ఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు దాసరి లక్ష్మీ నర్సయ్య, సర్పంచ్లు మోహన్ రెడ్డి,వెంకటేష్, జగదీష్, పాపాయి తిరుపతి, ఎంపిటిసి గోదావరి, సాయిలు, బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు శక్కరి కోండ కృష్ణ, కో- అఫ్షన్ సబ్యులు షేక్ నయీమ్, నీరడి పద్మారావు, జీనియస్ నరాయణ రావు, మోహమ్మద్ యూసుఫ్,అంబర్ సింగ్, సాకలి సాయిలు,పిఅర్ ఈఈ శంకర్ నాయక్, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ జీనియస్ నారాయణ రెడ్డి, గ్రామ అభివృద్ది కమిటీ అధ్యక్షులు కృష్ణ, క్యాషియర్ రవి, ఓడ్డేం నర్సయ్య, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.