నవతెలంగాణ-కంటేశ్వర్ : హైదరాబాద్ బాగలింగంపల్లిలోగల ఓంకార్ భవన్ లో జరిగిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ రాష్ట్ర ఎన్నికల కమిటి సమావేశంలో
మొదటి జాబితాను ఆదివారం ప్రకటించింది. రాష్ట్ర కమిటి విడుదల చేసిన 18 మంది మొదటి జాబితాలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సబ్బని లత ను
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత ను రాష్ట్ర కమిటి ప్రకటించింది.గత రెండున్నర దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాల్లో క్రియాశీ పాత్ర పోషిస్తున్న సబ్బని లతను ఆ పార్టీ తెగిన ప్రాదాన్యత ఇచ్చిందని బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి జిల్లా కన్వీనర్ కె.మధు తెలిపారు.