– సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో అభివృద్ధి..
– సైంటిస్టులు, విద్యావేత్తలు,
– మేధావులు తయారు కావడానికి గురువుల పాత్ర కీలకం..
– డీఆర్డీవో మాజీ చైర్మన్ జి.సతీష్ రెడ్డి
– రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ రిక్క లింబాద్రి..
నవతెలంగాణ- డిచ్ పల్లి : భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చాలా త్వరగా అభివృద్ధి చెందుతుందని, త్వరలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలుస్తుందని డీఆర్డీవో మాజీ చైర్మన్ జి.సతీష్ రెడ్డి అన్నారు. ఆదివారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని జీ కన్వెన్షన్ లో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బెస్ట్ టీచర్స్ అవార్డ్ సెరెమనీ- 2023″ కార్యక్రమానికి సతీష్ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ రిక్కలింబాద్రి లు ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. 150 మంది ప్రయివేటు పాఠశాలలకు చెందిన టీచర్లకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రతి ఏటా 14. లక్షల మంది ఇంజనీర్లుతయారవు తున్నారని తెలిపారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేర్పులు వచ్చాయని, ప్రపంచంలో సాఫ్ట్వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని మన విద్యార్థులు, యువకులు సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మనకు గతంలో ఒక 5 ఐఐటీలు ఉండేవని, ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఐఐటీలు ఉన్నాయన్నారు. ఇది వరకు మనం ఉన్నత విద్యా అవకాశాల కోసం బయటికి వెళ్లాల్సి వచ్చేదని కాని ఇప్పుడు ఇక్కడే చదువుకునే అవకాశం ఉందన్నారు. గతంలో మన విద్యార్థులు విదేశాలకు వెళ్లేవారని, ఇప్పుడు 80% శాతం విద్యార్థులు ఇక్కడే ఉండి అన్ని రంగాల్లో తమలో దాగి ఉన్న ప్రతిభను చాటుతూ దేశాభివృద్ధికి తోడ్పతున్నారని తెలిపారు. ఒక పరిశ్రమ లేదా కంపెనీ ప్రారంభించాలంటే గతంలో యువత వెనుకంజ వేసేవారని ఇప్పుడు స్టార్టప్ల పేరుతో యువత ఎన్నో కంపెనీలు
ప్రారంభిస్తున్నారని ఇది దేశానికి శుబసుచకమని తెలిపారు. దేశంలో సైంటిస్టులు, విద్యావేత్తలు, మేధావులు తయారు కావడానికి గురువుల పాత్ర చాలా కీలకమన్నారు. 2018 లో దేశంలో 450 స్టార్టప్ లు మాత్రమే ఉండగా ప్రస్తుతం లక్షకు పైగా దాటి పోయాయన్నారు. ఇందులో 80% శాతం యువతే ఉన్నారని సతీష్ రెడ్డి తెలిపారు.రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యారంగంలో విద్యార్థుల ప్రవేశాలు అమాంతంగా పెరిగాయన్నారు. ఎంసెట్ లో ఈ సారి కనివినీ ఎరుగని రీతిలో 2.31 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తులు అందజేసి పరీక్షలు రాయగా, ఇందులో ఎక్కువగా 11 కంప్యూటర్ కోర్సుల్లో చేరినట్లు తెలిపారు. కొత్త సిలబస్ ప్రకారం విద్యార్థులు మూడు రోజులు కళాశాలలో, మరో మూడు రోజులు కంపెనీలు, పరిశ్రమల్లో పని చేసుకునే అవకాశం కల్పించగా విద్యార్థులకు నెలకు రూ.7 వేల వరకు డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా బీఎస్సీ హానర్స్ కోర్సు ప్రవేశపెట్టామన్నారు. విద్యలేనిదే ఏదీ సాధించలేమని, సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్నామని తెలిపారు. దానిలోనే ప్రపంచంలో చంద్రయాన్ 3 ఒక అద్భుతమైన రికార్డు ను సంపాదించుకుందని వివరించారు.తము
చదివిన రోజుల్లో టెక్నాలజీ అంతంత మాత్రంగానే ఉండేదని,అది క్రమేణా వృద్ధి సాధించిందని,దఇన్నతటఇకఇ కారణం విద్యా అన్నారు.విద్యా లేనిదే భవిష్యత్తులో ఏమి సాధించ లేమని పేర్కొన్నారు.ఏదైనా అభివృద్ధి సాదించాలంటే ముందుగా విద్య అవసరమని,మానవ అభివృద్ధి లో విద్య అత్యంత కీలకపాత్ర పోషించిందన్నారు. ఉన్నత విద్యలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. మారుతున్న కాలాని కనుగుణంగా విద్యారంగంలో అనేక మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. గురువులుగా మీ అందరిపై ఎంతో బాధ్యత ఉంటుందన్నారు. ప్రైవేట్ పాఠశాల ల్లో విద్యాబుద్ధులు చేప్పే గురువులకు వారి ప్రతిభ ప్రకారం అవార్డులు అందజేయడం హర్షించదగ్గ విషయ మన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, జిల్లా అధ్యక్షుడు జయసింహగౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి. గంగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానస గణేష్, విష్ణువర్దన్, జిల్లా కార్యదర్శి ఆర్ఎ జనార్దన్, కోశాధికారి నిత్యానందం, జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్, జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, కన్వీనర్ సుందర్, 2 ట్రస్మా మండల అధ్యక్షుడు జీనియస్ గంగారెడ్డి, డివిజన్ ప్రతినిధులు విక్రాంత్, తేలు గంగాదర్, తదితరులు పాల్గొన్నారు.