నవతెలంగాణ విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా చూడాలని వారు పేర్కొన్నారు. చంద్రబాబు మెడికల్ రిపోర్టులను కోర్టుకు సమర్పించి మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. న్యాయవాదుల పిటిషన్పై ఏసీబీ న్యాయస్థానం వాదనలు విననుంది. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తోన్న టీడీపీ కోర్టుకు వెళ్లాలని, న్యాయవాదుల ద్వారా పిటిషన్ దాఖలు చేయించాలని ఈ రోజు నిర్ణయించింది. దీంతో న్యాయవాదులు ఇందుకు సంబంధించి పిటిషన్ను సిద్ధం చేసి, ఆ తర్వాత కోర్టులో దాఖలు చేశారు. అయితే రేపు కూడా సెలవు కావడంతో ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.