నవతెలంగాణ -ముంబయి: గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతం చేయడమే ధ్యేయంగా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను మోడీ ఈ రోజు ప్రారంభించనున్నారు. వర్చువల్ గా మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల్లో 511 సెంటర్లను ప్రధాని ప్రారంభించనున్నారు. బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ పేరిట 511 గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలో ప్రారంభించనున్నారు. ఆ రాష్ట్రంలోని 34 జిల్లాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించడమే ఈ కేంద్రాల ముఖ్య ఉద్దేశమని అధికారులు చెప్పారు. ఒక్కో కేంద్రంలో కనీసం రెండు వృత్తి విద్యా కోర్సుల్లో సుమారు 100 మంది యువకులకు శిక్షణనివ్వనున్నారు. ఈ శిక్షణను పలు ఇండస్ట్రీల భాగస్వాములు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కింద ఉన్న ఏజెన్సీలు అందిస్తున్నాయి.