నవతెలంగాణ- శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని పుల్వామా లో స్థానికేతరుడిపై సోమవారం ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. తుపాకీ గాయాలతో అతడు మృతి చెందాడు. మృతుడు ఉత్తర్ప్రదేశ్ నుంచి వచ్చిన వలసకూలీ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు జరుగుతోందని చెప్పారు. ‘పుల్వామాలోని నౌపోరా ప్రాంతంలో ఓ వలసకూలీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తూటా గాయాలతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఉత్తర్ప్రదేశ్కు చెందిన ముకేశ్గా గుర్తించాం’ అని పోలీసులు తెలిపారు. జమ్మూకశ్మీర్లో 24 గంటల వ్యవధిలో జరిగిన రెండో ఘటన ఇది.