నవతెలంగాణ న్యూఢిల్లీ: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఎమర్జెన్సీ బెడ్ ఖాళీ లేక బీజేపీ మాజీ ఎంపీ కుమారుడు ఆస్పత్రికి వచ్చిన గంటసేపటికే మరణించాడు. లక్నోలోని సంజయ్గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ బీజేపీ ఎంపీ భైరాన్ ప్రసాద్ మిశ్రా తన కొడుకు ప్రసాద్ మిశ్రాను గత శనివారం రాత్రి దవాఖానకు తీసుకొచ్చారు. అయితే ఎమర్జెన్సీ బెడ్స్ ఖాళీ లేవని డ్యూటీ అధికారి చెప్పారు. ఆ తర్వాత గంటసేపటికే ప్రకాశ్ మిశ్రా మరణించారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ రాత్రంతా ఆస్పత్రిలో ధర్నా చేశారు.
వారికి ప్రాణాలకన్నా… ఎన్నికలే ముఖ్యం : అఖిలేశ్ యాదవ్
ప్రసాద్ మిశ్రా మరణంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎక్స్లో ట్వీట్ చేస్తూ.. ‘యూపీలో అధికార పార్టీ మాజీ ఎంపీ కొడుక్కే చికిత్స లభించకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఇతర రాష్ర్టాల్లో ఎన్నికల ప్రచారం చేసొచ్చిన తర్వాత మంత్రి దీనిపై స్పందిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వారికి ఎవరి ప్రాణాల కన్నా ఎన్నికలే ముఖ్యం’ అని విమర్శించారు.