నవతెలంగాణ-నకిరేకల్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం కోరారు. బుధవారం పట్టణంలోని 6, 7 వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను వివరిస్తూ తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని విమర్శించారు. అవినీతి కి కేరాఫ్ కేసిఆర్ ప్రభుత్వమని విమర్శించారు. అనంతరం ఆయా వార్డులకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.