నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈనెల 6 నుంచి 12వ తేదీ వరకు గుంటూరు-విశాఖ(17239) సింహాద్రి ఎక్స్ప్రెస్, రాజమహేంద్రవరం- విశాఖ(07466) మెమూ, విశాఖ- రాజమహేంద్రవరం(07467) మెమూ.., ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు విశాఖ-గుంటూరు (17240) సింహాద్రి ఎక్స్ప్రెస్ను రద్దు చేసినట్లు ప్రకటించారు.