నవతెలంగాణ మెదక్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్లకల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లి తన ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్ నుంచి తూప్రాన్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై కరుణాకర్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.