– మూడేండ్లలో రెండు లక్షల మంది మహిళల అదృశ్యం
– మొదటిస్థానంలో గిరిజన జిల్లా అలిరాజ్పూర్
– దుర్భర వలసలు, అధిక పేదరికం, తక్కువ స్థాయి విద్య తదితరాలు
– ఇవన్నీ అదృశ్యం కేసులకు దారితీస్తున్న కారణాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మధ్యప్రదేశ్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. ఈ రాష్ట్రంలో మూడేండ్ల కాలంలో దాదాపు రెండు లక్షల మంది మహిళలు, చిన్నారులు అదృశ్యమయ్యారు. అలాగే ఇక్కడ ఆకలి, దుర్భర వలసలు, అధిక పేదరికం, వాతావరణ మార్పులతో పాటు రాజకీయం కూడా కారణంగా ఉన్నది.
2022 ఏప్రిల్లో 12 ఏండ్ల రష్మీ తన తల్లి దేవికి అలీరాజ్పూర్ నగరంలోని ఒక భవనంలో నిర్మాణ కార్మికురాలిగా తాను ప్రయత్నిస్తానని చెప్పింది. చుట్టుపక్కల ప్రతి గ్రామంలాగే వారి గ్రామమైన ఛక్తాలాలో పెరుగుతున్న ఏ పిల్లలకైనా ఇది కోర్సుకు సమానంగా ఉంటుంది.
దేవి ఓ వితంతువు. ఆమెకు తన నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలను పెంచుతూ కాలం గడిపేది. ఆమెకు ఇక్కడ కొద్దిపాటి భూమి ఉంది. దానిపై ఆధారపడి జీవిస్తుంది. కానీ తొమ్మిది మంది కుటుంబానికి ఆ భూమి ఎంత అందించగలదు? దీంతో ఆమె ”కుటుంబంలోని ప్రతి ఒక్కరూ పని చేయాలి. ఇది ఇక్కడ ఆచారం” అని చెప్పారు.దీనికి సరిగ్గా ఏడాది ముందు, తన కూతురు రష్మీని గుజరాత్లోని కతియావార్కు పంపారు. అక్కడ ఆమె మూడు నెలలు కూలీగా పని చేసింది. రష్మీ తన ఉద్యోగ వేట ప్రారంభించే ముందు సమీపంలోని మార్కెట్ నుండి బట్టలు కొనడానికి తన తల్లిని రూ. 200 అడిగింది. ఆ రోజు, మరుసటి రోజు రష్మీ ఇంటికి తిరిగి రాలేదు. దేవి ఆమె కోసం మార్కెట్లో వెతకడానికి వెళ్ళింది. వారి ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో మైదానం మార్కెట్ మధ్యలో ఉంది. కాని ఆమె దొరకలేదు. బంధువులు, ఇతర గ్రామస్తులు వెతకడం ప్రారంభించారు.ఈ ప్రాంతంలో బాల కార్మికులు పనిచేయడం ఎంత సాధారణమైన విషయమో, అదే విధంగా ఇక్కడ చిన్నారులూ తప్పిపోతుండడం సాధారణమైపోయింది. మధ్యప్రదేశ్లో చిన్నారులు, బాలికలు తప్పిపోయిన కేసులు దేశంలోనే అత్యధికం.
ఎన్సీఆర్బీ డేటాలోనూ..
2019-2021 మధ్య మధ్యప్రదేశ్ నుంచి దాదాపు 2 లక్షల మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారని, ఈ ఏడాది జులైలో పార్లమెంటులో హౌం మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా తెలిపింది. మరే రాష్ట్రంలోనూ ఇన్ని తప్పిపోయిన మహిళలు, బాలికల కేసులు లేవు. 2022లో మధ్యప్రదేశ్లో ప్రతిరోజూ 32 మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు. అందులో 24 మంది బాలికలు (75 శాతం)ని చైల్డ్ రైట్స్ అండ్ యు (సి ఆర్ వై) ఎన్జీఓ ద్వారా సేకరించిన సమాచారాన్ని సమాచార హక్కు (ఆర్టీఐ) నివేదిక తెలిపింది.
అదృశ్యమైన మహిళలు, పిల్లల కేసులు ఎక్కువగా కనిపించే గిరిజన లేదా ఆదివాసీ జిల్లాలే అని కూడా డేటా స్పష్టం చేస్తుంది. తప్పిపోయిన మహిళల సూచికలో అత్యధిక ర్యాంక్లో గిరిజన జిల్లా అలిరాజ్పూర్ ఉంది. అదృశ్యమైన వారిలో కొందరిని గుర్తించారు. మరికొందరు కనిపించలేదు. ఈ తప్పిపోయిన కేసుల్లో పెద్ద సంఖ్యలో దుర్భర వలసలు, ఉద్యోగ అవకాశాల కొరత, వాతావరణ మార్పు, అధిక పేదరికం, తక్కువ స్థాయి విద్య, పరిమిత స్వేచ్ఛలు, వ్యవస్థలోని పక్షపాతాలతో ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ సమిష్టిగా అదృశ్యం కేసుల సంఖ్యకు దారితీస్తున్నాయి. అందులో రష్మీ కేసు ఒకటి మాత్రమే.