నవతెలంగాణ మల్హర్ రావు.
మంథని నియోజకవర్గ ప్రజలు బిఎస్పీ పార్టీ వైపు చూస్తున్నారని,దీంతో మంథనిలో మార్పు మొదలైందని మంథని బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మంథని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మహాదేవపూర్ మండలంలోని మద్దులపల్లి గ్రామంలో పలువురు యువకులు బీఎస్పీ పార్టీలో చేరారు. వారికి చల్లా బిఎస్పీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో ప్రజలు, యువకులు మంథనిలో మార్పు కోరుకుంటున్నారని, మంథని నియోజకవర్గంలో గత పాలకులు అక్రమాలు చేసి వారు అభివృద్ధి చెందారు తప్పా మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది లేదు, కాబట్టి యువకులు, విద్యావంతులు మంథని నియోజకవర్గంలో బహుజన జెండా ఎగరేయడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చి భారీ సంఖ్యలో ఇవ్వాళా బీఎస్పీ కండువా కప్పుకొంటున్నట్లుగా తెలిపారు.మంథనిలో మార్పు కోసం యువకులంత ఒక్కటై మార్పు సాధిస్తామని, అది కేవలం బీఎస్పీతో సాధ్యమని ముందుకు వస్తున్నారన్నారు.