నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రవేశారు. తెలంగాణ, అలహాబాద్, కొల్కతా హైకోర్టులకు సంబంధించి ఐదుగురు న్యాయమూర్తుల బదిలీకి ఇటీ వల సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫారసులకు రాష్ట్రపతి సోమవారం ఆమోద ముద్ర వేసినట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ ట్విట్టర్ (ఎక్స్)లో వెల్లడించారు.
కాగా తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ ఎం సుధీర్ కుమార్ను మద్రాస్ హై కోర్టుకు, జస్టిస్ సి.సుమలతను కర్నాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. కల కత్తా హైకోర్టుకు చెందిన జస్టిస్ శేఖర్ బి. సరఫ్, జస్టిస్ బిబేక్ చౌదరి వరుసగా అలహాబాద్, పాట్నా హైకోర్టులకు బదిలీ అయ్యారు. అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేశారు.