నవతెలంగాణ-చేవెళ్ల
చేవెళ్ల నియోకవర్గంలోని షాబాద్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 400 నుంచి 500 మంది బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, చేవెళ్ల నియోజకవర్గం మాజీ ఇన్చార్జి దేశమోళ్ల అంజనేయులు ఆధ్వర్యంలో షాబాద్ మండలంలోని దాదాపు అన్ని గ్రామాలల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి మరికొంత మంది బీజేపీ నుండి బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య పాల్గొని పార్టీలో చేరుతున్న వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను పొందుతున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని వాటిని కూడా చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నట్టు తెలిపారు. తెలంగాణ ఆడపిల్లల పెండ్లి అంటే భారం కాదు.. సంబురం , కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేస్తున్న కేసీఆర్కు మద్దతు తెలుపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మిరమణారెడ్డి, చేవెళ్ల జడ్పీటీసీ సభ్యురాలు మర్పల్లి మాలతి కష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు శేరి శివారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు భీమయ్య, మల్లారెడ్డి, నడిమొళ్ల లావణ్యశంకర్, నరహరి రెడ్డి, జంగారెడ్డి, ఎంపీటీసీలు సత్యనారాయణ చారి, మాజీ ఎంపీపీ బాల్ రాజు, మాజీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మల్గని నరేందర్ గౌడ్, కౌకుంట్ల గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నాగార్జున రెడ్డి, డైరెక్టర్లు కష్ణ, వెంకటేష్, మాజీ డైరక్టర్ ఘనీ, సీనియర్ నాయకులు కష్ణా రెడ్డి, నరేందర్ రెడ్డి, స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.