– 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రగతి సాధించిన కేసీఆర్
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అగమైందని చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. సోమవారం చేవెళ్ల మండల పరిధిలోని ఈర్లపల్లి ఎనికేపల్లి, గొల్లగూడ, కమ్మెట, చన్వెల్లి, ఇక్కరెడ్డిగూడ తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్ధి కాలె యాదయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తే మోసాలు ఉంటాయని, కరెంటు ఉండదని అన్నారు. 60ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అగమైనదని, తెలంగాణ 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఆధీనంలో ప్రగతి సాధించిందని తెలిపారు. ఎన్నికల ముందు మాత్రమే ప్రజల ముందుకు వచ్చి అఢ్డగోలు హామీలు ఇస్తూ మోసగించడమే వారి లక్ష్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండానే అర్హులకు రుణాలు అందించడమే కాకుండా, ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా కేసీఆర్కు బాసటగా నిలిచారని అన్నారు. ఎన్నికల్లోనూ మరోసారి అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు 60 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. వాస్తావాలు చెప్పే వారి మాటలు మాత్రమే ప్రజలు విశ్వసిస్తారని చెప్పారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మిరమణారెడ్డి, చేవెళ్ల జడ్పీటీసీ సభ్యురాలు మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు శేరి శివారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు భీమయ్య, మల్లారెడ్డి, నడిమొళ్ల లావణ్యశంకర్, నరహరిరెడ్డి, జంగారెడ్డి, పద్మ ప్రభాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, వెంకటేశం గుప్తా, ఎంపీటీసీలు సత్యనారాయణ చారి, మాజీ ఎంపీపీ బాల్ రాజు, మాజీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మల్గని నరేందర్ గౌడ్, మైనార్టీ జిల్లా నాయకులు అలీ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ బ్యాగరి నర్సింలు, కౌకుంట్ల గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నాగార్జున రెడ్డి, అల్లవాడ గ్రామ వార్డు సభ్యులు నరేందర్ రెడ్డి, డైరెక్టర్లు కృష్ణ, వెంకటేష్, మాజీ డైరక్టర్ ఘనీ, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, స్వామి గౌడ్ పాల్గొన్నారు.