– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్
నవతెలంగాణ-ముషీరాబాద్
ముషీరాబాద్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని కవాడీగూడ డివిజన్ దోమలగూడ, అంబేద్కర్నగర్, రోజ్కాలనీ, భాను కాలనీ హుదా బాగ్, బాదాం గల్లి, గగన్ మహల్ గల్లి బందావన నగర్, మైసమ్మ బండ, జ్యోతి నగర్ తదితర బస్తీలో నాయకులు కార్య కర్తలతో కలిసి అంజన్కుమార్ యాదవ్ పాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ పాదయాత్రలో ఎటు చూసినా గతంలో తాను చేసిన అభివద్ధి కనిపి స్తుంద న్నారు. కొత్తగా బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదని తెలిపారు. రాబోయే కాంగ్రెస్ ప్రభు త్వంలో అవినీతి రహిత పాలన అందిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్ కుమార్ యాదవ్, టిల్లు యాదవ్, కల్పనా యాదవ్, కవాడి గూడ డివిజన్ అధ్యక్షులు భాస్కర్, మారిశెట్టి నర్సింగ్, అంజి యాదవ్, తదితర నాయకులు పాల్గొన్నారు.