నవతెలంగాణ-కేబీహెచ్బీ
తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లి ంలకు సంక్షేమ పథకాలు శూన్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండిరమేష్ అన్నారు. మంగళవారం ఆయన అల్లాపూర్ డివిజన్ రాజీవ్ గాంధీనగర్ లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోర్డినేటట్ డాక్టర్ సత్యం శ్రీరంగం, బ్లాక్ ప్రెసిడెంట్ తూము వేణుతో కలిసి ఆరు గ్యారంటీ పథకాల గురించి వివరిస్తూ ప్రచారం చేశారు. ఇక్కడ ఇంటింటా ముస్లిం సోదరులు వారి వారి సమస్యలు వివరించారు అనంతరం అభ్యర్థి బండి రమేష్ మాట్లాడుతూ తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదని, అలాగే రేషన్ కార్డు లు ఇవ్వలేదు అని ఒక్క పథకం అయినా 100శాతం అమలు చేశావా అని ప్రశ్నించారు. మీ మోసపురితమైన, నక్క జీత్తుల ఆలోచనలు తెలంగాణ ప్రజలు పసిగట్టార న్నారు. హస్తం మా నేస్తం అంటూ నినాదాలతో బస్తీ వాసు లు ఏకమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసి డెంట్ నర్సింహా యాదవ్,విఠల్ రెడ్డి, వాహిద్, యూత్ ప్రెస ిడెంట్ పల్లపు వేణు మహిళా అధ్యక్షరాలు భారతమ్మ చోటే మోహిస్,మున్నాఅసోద్దీన్, జీయర్, కార్యకర్తలు పాల్గొన్నారు.