– హుస్నాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
మన గ్రామం, మన తండా, మన రాజ్యం నినాదాన్ని సీఎం కేసీఆర్ నిజం చేసి మన ఆత్మగౌరవాన్ని పెంచారని, మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగా ణ మరింత అభివద్ధి చెందుతుందని హుస్నా బాద్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ మండలం లోని జిల్లెల్లగడ్డ, వంగరామయ్యపల్లి, బల్లు నాయక్ తండ, మీర్జాపూర్, పోతారం (ఎస్), నాగారం, ఉమ్మాపూర్, మహమ్మదాపూర్ గ్రామాలలో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. గిరిజనులు, వివిధ గ్రామాల ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరి ఆశీర్వాదం తనపై ఉండాలని, హుస్నాబాద్ ఎమ్మెల్యేగా మూడవసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల కలబొల్లి మాటలు నమ్మొద్దని, మంచి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరొకసారి గెలిపించుకోవాలని కోరారు.